మహేష్ బాబు మూవీ రూమర్లపై స్పందించిన డైరక్టర్

  • September 16, 2016 / 09:42 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పై వస్తున్న రూమర్లపై డైరక్టర్ మురుగ దాస్ స్పందించారు. వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో  ప్రిన్స్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు నయనతార కూడా  నటిస్తోందని వార్త కొన్ని రోజులుగా చక్కర్లు కొట్టాయి. ఆ చిత్ర బృందం నుంచి ఎటువంటి ఖండన రాకపోవడంతో అందరు నిజమని భావించారు. అయితే ఆ వార్తలో నిజం లేదని మురుగ దాస్ స్పష్టం చేశారు.

ఈ రోజు ట్విట్టర్ వేదికగా అసలు విషయాన్నీ చెప్పారు. ” మహేష్ సార్ తో నటించే ఒకే ఒక కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే. ఇంకెవరిని తీసుకోలేదు” అని ట్వీట్ చేశారు. దీంతో మహేష్, నయనతారల కాంబినేషన్ పై వస్తున్న రూమర్లకు ఫులుస్టాప్ పడింది. ఎం.వి. ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా 80 కోట్ల బడ్జెక్ట్ తో తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ దీపావళికి రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus