అమర్ అక్బర్ యాంటోనీలో నివేదా థామస్!

  • January 31, 2018 / 08:17 AM IST

ప్రస్తుతం “టచ్ చేసి చూడు” రిలీజ్ ప్రమోషన్స్ తోపాటు కళ్యాణ్ కృష్ణ చిత్రంతో బిజీగా ఉన్న రవితేజ ఆ సినిమా అనంతరం తన చిరకాల మిత్రుడు, తనను హీరోగా పరిచయం చేసిన శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి “అమర్ అక్బర్ యాంటోనీ” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. రవితేజ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయనున్నాడనే కథనాలు సైతం వెలువడుతున్నాయి.

అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒన్నాఫ్ ది హీరోయిన్ గా నివేదా థామస్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ ఎనర్జీకి, నివేద పెర్ఫార్మెన్స్ యాడ్ అయితే అవుట్ పుట్ అదిరిపోతుందనే ఆలోచనతో ఈ పెయిర్ సెట్ అయ్యింది. ఈ ఏడాది జూలై లేదా ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ఇకపోతే.. మొన్నటివరకూ స్టడీస్ కంప్లీట్ చేయాలంటూ వేరే సినిమాలేవీ అంగీకరించని నివేదా మొన్న నాగశౌర్య సినిమా, ఇప్పుడు రవితేజ సినిమా సైన్ చేసి తన తోటి యువ హీరోయిన్లకి గట్టిపోటీనిస్తూ.. తన స్థానాన్ని పదిలపరుచుకుంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus