జై లవకుశ కోసం క్లాసికల్ డ్యాన్సర్ ని బయటపెట్టనున్న ఎన్టీఆర్!

  • May 15, 2017 / 11:41 AM IST

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. నిన్నటి వరకు హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో ప్రత్యేక సెట్ వేసి భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీలో తారక్ తొలి సారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్ర పేరు లవ కుమార్. చాలా క్లాస్ గా ఉంటారు. ఇక రెండో పాత్ర నాటకాలు, నృత్యాలు అంటే ఇష్టపడే పాత్ర జై. ఇతను క్లాసికల్ నృత్యాన్ని అద్భుతంగా వేస్తాడు. ఆ పాత్రకు ఎన్టీఆర్ వంద శాతం న్యాయం చేస్తారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

ఎందుకంటే ఎన్టీఆర్ ఏడేళ్ల పాటి కూచిపూడిని నేర్చుకున్నారు. ఇప్పటికీ ఆ నృత్యాన్ని చక్కగా వేయగలరు. సో అతనిలోని కూచిపూడి నృత్యకారుణ్ణి బాబీ జై లవకుశ కోసం బయటికి తీసుకొస్తున్నారు. ఈ క్లాసికల్ డ్యాన్స్ సీన్లను రానున్న షెడ్యూల్లో తెరకెక్కించనున్నట్లు సమాచారం. మూడో పాత్ర కుశ విలనిజం తో భయపెట్టనున్నారు. రాశీఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు శ్రమిస్తున్నారు. జనతా గ్యారేజ్ విడుదలైన సెప్టెంబర్ 1 న జై లవకుశ రిలీజ్ చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus