మళ్ళీ రిలీజ్ డేట్లతో కొట్టుకుంటున్న మహేష్, బన్నీ?

  • October 14, 2019 / 08:43 AM IST

అనుకోకుండా ఒకే రిలీజ్ డేట్ కి కొన్ని సినిమాలు అనౌన్స్ చేయడం.. తరువాత మీటింగ్ లు పెట్టుకుని రాజీ కుదుర్చుకోవడం.. ఈ మధ్య సర్వ సాధారణమైపోయింది. తద్వారా ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అనుకుంటున్నారో … ఏమో..! మొన్నటికి మొన్న ‘గ్యాంగ్ లీడర్’ , గద్దలకొండ గణేష్(వాల్మీకి) చిత్రాల విషయంలో ఇలాగే జరిగింది.ఈ రెండు సినిమాలు మొదట సెప్టెంబర్ 13 డేట్ అనౌన్స్ చేసి.. తరువాత మీటింగ్ లు పెట్టుకుని రాజీకి వచ్చారు. గతేడాది మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా’ సినిమాలకు కూడా ఇలానే చేసారు.

ఇప్పుడు మళ్ళీ ఇదే హీరోలు .. రిలీజ్ డేట్లతో కొట్టుకుంటున్నారు. విషయం ఏంటంటే.. అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురంలో’ సినిమాని 2020 జనవరి 12 న విడుదల ఛెయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఇలా ప్రకటించిన గంట తరువాత మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని కూడా 2020 జనవరి 12 నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అసలు ఈ బిల్డప్ ఎందుకు .. ఎలాగూ దిల్ రాజు, అల్లు అరవింద్ లు మీటింగులు పెట్టి డేట్ మార్చుకుంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus