బిగ్‌బాస్‌4: అర్ధరాత్రి వంట గదిలో దూరి తినేసిన వైనం!

  • October 16, 2020 / 09:32 AM IST

బిగ్‌బాస్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. అవును నిజం. అర్ధరాత్రి 12 తర్వాత నక్కి నక్కి వచ్చి ఇంట్లో ఖరీదైన పిస్తా పప్పు తినేశారు. అదేంటి ఫుల్‌ ప్రొటక్షన్‌ ఉంటుంది కదా. ఎలా వస్తారు అనుకుంటున్నారు. బయటి నుంచి రావడానికి వీలవుదు కానీ.. ఇంట్లో దొంగలు అయితే ఏముంది సమస్య. మీరు చదివింది కరక్టే. ఇంట్లోని వ్యక్తులే దొంగలుగా మారి వంట గదిలో దాచిన పిస్తా పప్పు తినేశారు.

ఈ పిస్తా దొంగతనానికి హారికనే నాయకురాలు. దగ్గరుండి దొంగతనం చేసింది. అయితే మంచి దొంగ కావడం వల్ల ఆమె తినడంతో పాటు మరికొంతమందికి పెట్టింది కూడా. తొలుత ఎవరూ చూస్తున్నారో అంటూ లాస్య ఓ లుక్కేయగా… తొలుత హారిక పిస్తా కవర్‌ తీసుకొని తినడం మొదలెట్టింది. తర్వాత ఆమెకు లాస్య తోడైంది. ఇద్దరూ పప్పులు తినేసి తర్వాత వాటి తొక్కలతో డైస్‌ ఆట ఆడుకున్నారు. ఈ లోగా అక్కడికి అఖిల్‌ వచ్చాడు.

దొంగల బ్యాచ్‌లో జాయిన్‌ అయిన అఖిల్‌కు తొలుత పప్పులు ఇచ్చారు. ఈలోగా నోయల్‌ వచ్చి చేరాడు. ఇంకేముంది నవ్వులు నిండిపోయాయి. పప్పులు ఖాళీ అయిపోయాయి. పప్పులతోపాటు ఇంట్లో ఉన్న చాక్లెట్‌ సిరప్‌ను కూడా ఓ పట్టు పట్టేశారు. ఇదంతా జరుగుతుండగా దివి వచ్చి చేరింది. ఆ తర్వాత మందు సిట్టింగ్‌ జోక్‌లు వేసుకుంటూ కాసేపు నవ్వుకున్నారు. ఎపిసోడ్‌ను చిరాకుగా ముగించేయకుండా బిగ్‌బాస్‌ పప్పు దొంగలతో ముగించాడు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus