నరేంద్ర మోదీ పిలుపుకు స్పందించిన ప్రభాస్!

  • September 29, 2017 / 01:33 PM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం వివిధ వర్గాల ప్రముఖులను ఈ కార్యక్రమంలో భాగమవ్వాల్సిందిగా కోరి, ప్రత్యేకంగా వారికి లేఖలను కూడా పంపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమ నుంచి లేఖలందుకున్న వారిలో మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు..

ప్రభాస్ మోదీ పిలుపుకు స్పందించారు. తన ఫేస్ బుక్ ద్వారా ‘దేశం పరిశుభ్రంగా ఉండాలని తపించిన మహాత్మాగాంధీగారి జయంతి రోజున దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. దేశాన్ని శుభ్రంగా ఉంచడం నా భాద్యత మాత్రమే కాదు అలవాటు కూడా. నాలాగే ఇంకెవరైనా అనుకుంటే స్వచ్ఛమైన ఇండియా కోసం సహకారాన్ని అందిస్తూనే ఉండండి’ అంటూ అభిమానులను, ప్రజలను కోరారు..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus