ప్రభాస్ కోసం స్టోరీ సిద్ధం చేస్తున్న మహానటి డైరక్టర్!

  • June 13, 2018 / 10:23 AM IST

వైజయంతీ బ్యానర్ లో నిర్మితమయిన అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే కొంతకాలంగా విజయాలు లేవు. దీంతో సినిమా నిర్మాణానికి  అశ్వినీదత్ దూరంగా ఉండేవారు. తాజాగా సావిత్రి బయోపిక్ మహానటి చిత్రంతో వైజయంతీ బ్యానర్ కి పూర్వవైభవం వచ్చింది. అందుకే మళ్ళీ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా నిర్మించే పనిలో ఉన్నారు. దీని తర్వాత ప్రభాస్ తో సినిమా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ స్థాయి బాహుబలితో అమాంతం పెరిగిపోయింది. అతని సినిమా బడ్జెట్ 200 కోట్లకు దాటిపోతోంది.

అంతకంటే ఎక్కువగా ఖర్చుపెట్టడానికి అశ్వినీదత్ రెడీ గా ఉన్నారు. ఈ ప్రాజక్ట్ కి ఎవరో డైరక్టర్ ఎందుకని తన అల్లుడు… మహానటి వంటి కళాఖండాన్ని తెరకెక్కించిన  నాగ్ అశ్విన్ చేతిలో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కి నచ్చే విధంగా.. అతని రేంజ్ కి తగినట్లు కథ రాస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ చిత్రం కూడా ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన త్వరలోనే  రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus