పిల్లల కల నెరవేర్చిన రాజమౌళి

  • April 1, 2017 / 12:45 PM IST

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ ఎత్తులో సినిమాలను తెరకెక్కించడమే కాదు. అంతే విధంగా సాయం చేయగలరు. ఆయన వెండితెరపై గీసిన కళాఖండం బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, పాటలు అంచనాలను పెంచేసాయి. ఈ మూవీ ప్రచారంలో ఉన్న జక్కన్న ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ ఎన్జీవో సంస్థ “మేక్ ఏ విష్” తో చేతులు కలిపారు. గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం చేయించేందుకు దాతల నుంచి విరాళాలు సేకరించడంలో భాగస్వాములయ్యారు.

ఇందుకోసం సాయం చేసే వారికి బహుబలి ఫస్ట్ డే టికెట్స్  ఇస్తామని దర్శకధీరుడు ప్రకటించారు. టికెట్స్ తో పాటు బాహుబలి గుడీస్ ని కూడా అందిస్తానని వెల్లడించారు. “మీరు చేసే చిన్ని సాయం.. పిల్లల్లో పెద్ద మార్పును తీసుకొస్తుంది. దయచేసి సాయం చేయండి.. నవ్వుల్ని విస్తరించండి” అంటూ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన మంచి మనసును చాటుకున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus