రజనీ కాంత్ సినిమా చిత్రీకరణలో అంతరాయం

  • November 4, 2016 / 11:21 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ మరో సారి శాస్త్రవేత్త వశీకరణ్ గా నటిస్తున్న చిత్రం రోబో 2.0. దర్శకుడు శంకర్ ఎన్నో హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. “ఐ” బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ గత కొన్ని రోజులుగా చెన్నై లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రీకరణకు బ్రేక్ పడిందని సమాచారం. కారణం ఏమిటని అన్వేషించగా అసలు విషయం బయట పడింది.

సూర్య 24 సినిమాలో ఉపయోగించిన టైమ్ ఫ్రీజ్ అడ్వాన్స్ టెక్నీక్ ని రోబో 2.0 లోని ఒక సీన్ లో అప్లై చేస్తున్నారు. సినిమాలో అత్యంత కీలక మైన ఈ సన్నివేశానికి అత్యాధునిక కెమెరాలను ఉపయోగిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన నిపుణులు ఇందు కోసం శ్రమిస్తున్నారు. నిన్న ఈ సీన్ షూటింగ్ జరుగుతుండగా సాంకేతిక లోపం తలెత్తిందని తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించే వరకు దర్శకుడు షూటింగ్ కి బ్రేక్ చెప్పారు. మరో రెండు రోజుల్లో చిత్రీకరణ యధావిధిగా మొదలవుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

https://www.youtube.com/watch?v=K1d-p-_1LgE

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus