Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

అల్లు వారి ఇంట చిన్న కొడుకు శిరీష్‌ పెళ్లి వేడుకలు చాలా రోజుల క్రితమే మొదలయ్యాయి. పార్టీలు, ఫంక్షన్లు అంటూ ఇటు సాంప్రదాయలు, అటు సందళ్లు కలిపి చేస్తున్నారు అల్లు ఫ్యామిలీ. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో ఫ్యామిలీ అంతా కలసి సందడి చేశారు. ఇందులో రామ్‌చరణ్‌ – ఉపాసన దంపతులు కూడా ఉండటం విశేషం.

Allu Party

అల్లు శిరీష్‌ – నయనిక వివాహం మార్చి 6న జరగనుంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ వరుస పార్టీలు ఇస్తోంది. రీసెంట్‌ పార్టీలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలామందిని పిలిచారట. అందులో భాగంగానే పిలిచారో లేక ఫ్యామిలీ అని పిలిచారో తెలియదు కానీ మిస్టర్‌ సి అలియాస్‌ రామ్‌చరణ్‌, ఉప్సీ అలియాస్‌ ఉపాసన హాజరయ్యారు. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో ఫుల్‌ వైబ్‌తో ఈ పార్టీ సాగిందని ఆ ఫొటో చూస్తే అర్థమవుతోంది. ఎప్పటిలా ఫుల్‌ డ్రెస్‌ ఉపాసన కనిపించగా.. హీరోయిన్ల స్టయిల్‌ డ్రెస్‌లో అల్లు అర్జున్‌ వైఫ్‌ స్నేహ కనిపించారు.

ఇటీవల గోవాలో ఓ బ్యాచిలర్‌ పార్టీ కూడా జరిగింది. అప్పుడు కూడా కొన్ని ఫొటోలు ఇలానే వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఫ్రెండ్స్‌, క్లోజ్‌ రిలెటివ్స్‌, టాలీవుడ్‌లోని స్నేహితుల కోసం ఈ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారట. అల్లు శిరీష్‌, నయనిక నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే తొలి శుభలేఖను మావయ్య, అత్తయ్య చిరంజీవి – సురేఖకు ఇటీవల శిరీష్‌ అందించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలను కూడా ఫ్యామిలీలు షేర్‌ చేశాయి.

పెళ్లికి ముందు పార్టీలే ఇంత సందడిగా సాగుతున్నాయంటే.. ఇక పెళ్లి ఎలా జరుగుతుంది అనేది చూడాలి. అల్లు వారి చిన్న కొడుకు పెళ్లి కావడంతో భారీ హంగు, ఆర్బాటాలతో చేస్తున్నారు. ఈ తరానికి ఇది ఆఖరి పెళ్లి అని ఇలా చేస్తున్నారేమో.

రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus