35 ల‌క్ష‌ల మంది ఫ్యాన్స్‌తో ఇంట‌రాక్ష‌న్‌!

  • July 14, 2016 / 06:39 AM IST

రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `ధృవ‌` షూటింగులో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో శ‌ర‌వేగంగా సాగుతోంది. అయితే షూట్ గ్యాప్‌లో చ‌ర‌ణ్ కాసేపు అభిమానుల‌తో ముచ్చ‌టించేందుకు ప్లాన్ చేసుకున్నారు. నేరుగా ఫేస్‌బుక్‌లో ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు అభిమానుల‌తో ఇంట‌రాక్ట్ కానున్నారు. ఇప్ప‌టికే ఎఫ్‌బిలో ఆ సంగ‌తిని చ‌ర‌ణ్ అధికారికంగానే ధృవీక‌రించారు.

ఫేస్‌బుక్‌లో ఇప్ప‌టికే చెర్రీకి ఫేస్‌బుక్‌లో 35 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటు అభిమానుల‌తో పాటు కామ‌న్ జ‌నం చ‌ర‌ణ్‌ని సామాజ‌కి వెబ్‌సైట్ల‌లో ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించే అభిమానుల్లో డ‌బ్ స్మాష్‌తో ఎవ‌రైనా ఆక‌ట్టుకుంటే వారికి నేరుగా సెట్‌లో క‌లిసే అవ‌కాశం క‌ల్పించారు చ‌ర‌ణ్‌. మ‌రి మీరు కూడా ల‌క్ చెక్ చేసుకోండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus