హిట్ కోసం శాఖాహారిగా మారిన రామ్ చరణ్

  • May 27, 2016 / 09:58 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి హిట్ దోబూచులాడుతోంది. నాయక్, ఎవడు వంటివి యావెరేజ్ చిత్రాలగానే మిగిలాయి. మగధీర ల్లాంటి హిట్ కోసం చరణ్ ఎదురు చూస్తున్నాడు. అందుకే ఈ సారి గీతా ఆర్ట్స్ నిర్మాణంలో చేస్తున్నాడు. రేసుగుర్రం డైరక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నధ్రువ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత. మామ సలహా మేరకు రామ్ చరణ్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా రూపాయ్ కూడా తీసుకోవడం లేదని, కేవలం సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేరింగ్ మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడని సమాచారం.

తని వరువన్ సినిమాకి రీమేక్ అయినా ధ్రువలో పోలీస్ గా రామ్ చరణ్ నటించనున్నాడు. ఇందుకోసం అథ్లెటిక్ బాడీతో కనిపించేందుకు మాంసాహారాన్నిదూరం పెట్టాడు. పూర్తిగా ఆకుకూరలు, కాయగూరలతో చేసిన ఆహారాన్నిమాత్రమే తీసుకుంటున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపాడు. ఇప్పటికే ఒక షెడ్యుల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో రెండో షెడ్యుల్ కి రెడీ అవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus