‘ధృవ’ చిత్రీకరణలో పాల్గొన్న రామ్ చరణ్..!

  • June 4, 2016 / 12:33 PM IST

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధృవ’ చిత్రంలో ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. రామ్ చరణ్ మాత్రం చిత్ర షూటింగ్ లో పాల్గొన లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం శనివారం నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకోనుండగా.. ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు.

గచ్చిబౌలి లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. గీతా ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తుండగా, అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. కాగా తమిళంలో హిట్ కొట్టిన తనిఒరువన్ తెలుగు రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus