ఈమె కూడా వర్మ శిష్యురాలే!

  • July 18, 2016 / 12:16 PM IST

‘వర్మ కంపెనీ’ స్థాపించి బోలెడంత మందికి పని కల్పించాడు. చెప్పుకోదగ్గ ఫిల్మ్ మేకర్స్ వర్మ కంపెనీ నుండి వచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ లో రియలిస్టిక్ సినిమాలు తీసే.. అనురాగ్ కశ్యప్, శ్రీరామ్ రాఘవన్, నీరజ్ పాండే, సమిత్ అమీన్.. ఇలా చాలా మంది వర్మ కంపెనీ నుండి వచ్చిన వారే. ఇక టాలీవుడ్ లో కూడా వర్మ కంపెనీలో పని చేసిన వారున్నారు. తనే సంజనా రెడ్డి. జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సంజనా.. వర్మ పరిచయంతో ఆయన శిష్యురాలిగా వెళ్ళిపోయిందట.

ఇలా కేరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నసంజనా..  ”నేను జాబ్ ఛేంజ్ కోసం చూస్తున్నపుడు రామ్ గోపాల్ వర్మను కలిశాను. తర్వాత ఆయన అసిస్టెంట్ గా చేరిపోయాను. ఆయన కొత్త  ట్యాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ట్యాలెంట్ విషయంలో కొత్త పాత అనే బేధాలు ఆయనకు ఉండవు. ఆయన పరిచయం నా లైఫ్ కి టర్నింగ్ పాయింట్”  అని అంటోంది సంజన. ప్రస్తుతం.. రాజ్ తరుణ్ – అమైరా దస్తూర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రానికి సంజనానే దర్శకురాలు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus