అవార్డ్స్ ఇస్తేనే వస్తాం అంటున్న టాలీవుడ్ టాప్ హీరోలు!

  • June 29, 2017 / 02:45 PM IST

ఒక యువ హీరో చెప్పినట్లు అవార్డ్ అనేది మనలోని ప్రతిభని గుర్తించడం కోసమే కాదు ఇంకా ఇంకా.. ఎన్‌కరేజ్ చెయ్యడానికి. అయితే మన టాలీవుడ్ లో ఈ అవార్డ్స్ విషయంలో ఎన్నో రూమర్స్ ఉన్నాయి అన్న వాదన అందరికీ తెలిసిందే. అదే క్రమంలో హిట్ సినిమాలకు మాత్రమే అవార్డ్స్ వస్తాయి అన్న అపవాది కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే. ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ విషయంలో మన హీరోలు అవలంబిస్తున్న తీరు కొంచెం విమర్శలకు వేదికగా మారుతుంది అని చెప్పక తప్పదు…అసలు విషయం ఏంటి అంటే, టాలీవుడ్ లో మన స్టార్స్ కి ప్రతీ ఏడాది ఎన్నో అవార్డ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆ అవార్డ్స్ ఫంక్షన్స్ లో కేవలం అవార్డ్స్ వచ్చిన హీరోలు మాత్రమే దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే అవార్డ్స్ రానివారు కనపడక పోవడం ఎన్నో విమర్శలకు దారితీస్తుంది.

అసలు మ్యాటర్ లోకి వెళితే. తాజాగా 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్స్ అంగరంగా వైభవంగా జరిగింది. అయితే అదే క్రమంలో ఈ వేడుకలో నాన్నకు ప్రేమతో సినిమాకి గాను ఎన్టీఆర్ కి, ఇక సరైనోడు సినిమాకి గాను అల్లు అర్జున్ కి అవార్డ్స్ లభించాయి. ఇక వారిద్దరూ ఈ వేడుకలో మెరిశారు, అది సహజమే కానీ, మిగిలిన హీరోలు మహేష్, రామ్‌చరణ్, ప్రభాస్ ఇలా చాలామంది ఈ వేడుకలో కనిపించక పోవడం గమనార్హం. అయితే ఇందులో కొందరు నిజంగానే షూటింగ్ లో బిజీగా ఉంది రాలేకపోయినప్పటికీ. సినిమా సర్కిల్స్ నుంచి వస్తున్న వాదన ప్రకారం వారికి అవార్డ్స్ రాలేదు కనుక ఈ వేడుకలకు హాజరు కాలేదు అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ అవార్డ్స్ విషయంలో మరో కోణంలో విమర్శలు వస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus