కాశ్మీర్ లో సేద తీరుతున్న రేణు దేశాయ్

  • December 29, 2017 / 11:24 AM IST

ఎండాకాలంలో సైతం మంచు కురిసే కాశ్మీర్ లో ఇప్పుడు ఏకంగా మంచు వర్షాలే పడుతుంటాయి. ఆ వర్షాలను ఎంజాయ్ చేస్తున్నారు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కెమెరా ముందుకు ఇష్టపడని ఆమె.. తొలిసారి ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరించారు. ఈ షో షూటింగ్ వారం క్రితం పూర్తి అయింది. దీంతో వెంటనే కాశ్మీర్ విహారానికి వెళ్లారు. అక్కడే వారం రోజులుగా గడుపుతున్నారు. ఆమెతో పాటు కొడుకు, కూతురు వెళ్లారన్న సంగతి తెలియడం లేదు గానీ.. ఆమె తీసుకున్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా అక్కడ లోకల్ మహిళలతో గడుపుతూ.. టీ తాగుతూ.. మంచులో సేద తీరుతూ.. రేణు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత కొన్ని కథలను విననున్నారు. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారు. మెగా హీరోల సినిమా ద్వారా వస్తారా? లేకుంటే ఇతర హీరోల సినిమాల్లో కనిపిస్తారా ? అనేది సస్పెన్స్ గా మారింది. ఆమెకు తగ్గ పాత్రలను సృష్టించడంలో రచయితలు బిజీగా ఉన్నారు. రేణు దేశాయ్ నటిస్తే ఆ సినిమాకి తప్పకుండా క్రేజ్ వస్తుంది. అందుకే ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus