మంచి ఛాన్స్ అందుకున్న రితికా సింగ్!

  • June 13, 2018 / 07:27 AM IST

“సాలా ఖడూస్‌” సినిమా ద్వారా నటిగా మారిన  క్రీడాకారిణి రితికా సింగ్… గురు సినిమాతో తెలుగు వారికి పరిచయమంది. ఆ తర్వాత శివలింగ మూవీలో లారెన్స్ తో కలిసి స్టెప్పులను కూడా వేసింది. కానీ ఆ తరవాత ఆమె ఎక్కడ కనిపించలేదు. అవకాశాలు వస్తున్నప్పటికీ మంచి కథ కోసం చాలా రోజుల పాటు ఎదురుచూసింది. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పక్కన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం తేజ్  కరుణాకరాన్ దర్శకత్వంలో ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రంలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 6 న రిలీజ్ కాబోతోంది.

ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. కిషోర్ గతంలో ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి’ వంటి ఫీల్ గుడ్ చిత్రాలను అందించారు. ఇపుడు కూడా మంచి ఫీల్ ఉన్న కథని రాసుకున్నట్లు తెలిసింది. అందులో హీరోయిన్ గా రితికా సింగ్ ని సంప్రదించడంతో.. తన రోల్ మంచిగా ఉండడంతో ఓకే చెప్పింది. ఈ చిత్రంలో ఎమోషన్స్  ఎక్కువగా ఉంటాయని.. అలా అని కామెడీ మిస్ కాదని టాక్.  వచ్చే నెల చివరి వారం నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus