బాబీ దర్శకత్వంలో నటించనున్న సాయి ధరమ్ తేజ్

  • November 24, 2017 / 01:46 PM IST

తొలి చిత్రం పవర్ తోనే తన డైరక్షన్ పవర్ చూపించారు బాబీ. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ అందుకున్నారు. సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని తెరకెక్కించారు. అయితే ఇది ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో మరింత కసితో ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాని తీశారు. అతి తక్కువకాలంలో తారక్ తో అద్భుతమైన సినిమాని మలిచి హిట్ రూట్లోకి వచ్చారు. నెక్స్ట్ మళ్లీ మాస్ మహారాజ్ రవితేజ తోనే సినిమా చేయడానికి కథ సిద్ధం చేస్తున్నారు.

రవితేజతో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా స్టోరీ రెడీ చేస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. బాబీ అపజయంతో కుంగిపోయిన సమయంలో సాయి ధరమ్ తేజ్ చాలా ధైర్యాన్ని ఇచ్చారని.. అందుకే ప్లాప్ లతో పోరాడుతున్న తేజుకి మంచి హిట్ ఇవ్వాలని మంచి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే తేజు ప్రస్తుతం “జవాన్‌” సినిమాతో బిజీగా ఉన్నారు. బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ తరవాత వివి వినాయక్ తో సినిమా చేయనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత బాబీ దర్శకత్వంలో సాయి నటించవచ్చని ఫిలిం నగర్ వాసులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus