హీరోయిన్ కే ప్రాధాన్యత ఇస్తున్న మెగా హీరో

  • February 21, 2018 / 10:10 AM IST

పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క తో బోల్తా కొట్టారు. అప్పటి నుంచి లేవడానికి ప్రయత్నిస్తున్నా అపజయాలు ఎదురుపడుతున్నాయి. విన్నర్, నక్షత్రం, జవాన్ చిత్రాలు నిరాశపరిచాయి. వివి వినాయక్ కూడా సాయి ధరమ్ తేజ్ కి హిట్ ఇవ్వలేకపోయారు. “ఇంటెలిజెంట్‌” కూడా ఫెయిల్ కావడంతో సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ బాటలో నడుస్తున్నారు. మంచి హిట్ లేక బాధపడుతున్న వరుణ్ తేజ్ ఫిదా మూవీ చేశారు. ఇందులో తనకి కంటే హీరోయిన్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అయినా స్క్రిప్ట్ పై నమ్మకంతో ఒకే చెప్పారు.

బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అందుకే సాయి ధరమ్ తేజ్ కూడా వరుణ్ ఫార్ములాని ఫాలో అయ్యారు. ప్రస్తుతం తేజు కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పాత్రకంటే అనుపమ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని తెలిసింది. అయినా హిట్ అవసరం కాబట్టి ఈ కథను ఒకే చేసినట్లు ఫిలిం నగరవాసులు చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమాతోనైనా తేజు హిట్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి. కరుణాకరన్ కి కూడా విజయం అత్యవసరం. అందుకే చాలా చక్కగా సినిమా తీస్తున్నట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus