మొత్తానికి ఫిక్స్ అయిన సవ్యసాచి రిలీజ్ డేట్!

  • August 7, 2018 / 01:58 PM IST

నాగచైతన్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలుపెట్టిన చిత్రం “సవ్యసాచి”. చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. మాధవన్, భూమికలు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని జూలైలోనే విడుదల చేద్దామనుకొన్నారు చిత్రబృందం. కానీ.. గ్రాఫిక్స్ వర్క్ తోపాటు కొన్ని సీన్స్ అవుట్ పుట్ కూడా సరిగా రాకపోవడంతో ఆ సన్నివేశాలని రీషూట్ చేశారు.

ఆ కారణంగా జూలై అనుకున్న సినిమా ఆగస్ట్ కి, అక్కడి నుంచి సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇక ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకోవడం, టాకీ పార్ట్ కూడా ఫినిష్ అవ్వడంతో ఈ చిత్రాన్ని నవంబర్ లో రిలీజ్ చేయాలనుకొంటున్నారు. త్వరలోనే చిత్రబృందం పాటల చిత్రీకరణ కోసం లండన్ వెళ్లనున్నారు. అది కూడా పూర్తైపోతే.. నవంబర్ మొదటివారం లేదా చివరి వారంలో “సవ్యసాచి” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇకపోతే.. నాగచైతన్య మరో చిత్రం “శైలజారెడ్డి అల్లుడు” ఈనెల 31న విడుదలకానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అను ఎమ్మాన్యూల్ కథానాయికగా కనువిందు చేయనుండగా.. రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషించింది. ఈ రెండు సినిమాలు గనుక మంచి విజయం సాధిస్తే.. చైతూ కూడా ఫామ్ లోకి వచ్చేస్తాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus