బ్రహ్మానందంతో గొడవ గురించి చెప్పిన శివాజీ రాజా

  • July 24, 2017 / 03:29 PM IST

ప్రముఖ న్యూస్ ఛానెల్ ఆంధ్ర జ్యోతిలో ప్రతీ ఆదివారం ప్రసారం అయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె’కి వచ్చిన సీనియర్ నటుడు …శివాజీ రాజా…అనేక విషయాలను మనసువిప్పి మాట్లాడారు…అయితే ఆ కోణంలోనే ఆయన బ్రహ్మానందం తో ఎందుకు గొడవ పడ్డారో కూడా తెలిపారు…అసలు మ్యాటర్ ఏంటి అంటే…మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా…కమీడియన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ రాజా…కాస్త ముక్కు సూటి మనిషి అన్న అపవాది ఉంది…అయితే ఆ కోణంలోనే అనేక ఇబ్బందులను ఎదుర్కున్నాడట మన రాజా…అయితే వాటిపై ఆయన మాట్లాడుతూ….సినిమా రంగంలో ఎదగాలి అంటే కెమెరా ముందు నటించడం కంటే కెమెరా వెనుక నటించడం బాగా రావాలి అంటూ అది రానివాడు సినిమా రంగంలో ఎదగలేడు అన్న వాస్తవాన్ని బయట పెట్టాడు శివాజీరాజ. అదే క్రమంలో తన కెరియర్ తొలిరోజుల్లో సాయి కుమార్ రఘుబాబులు చేసిన సహాయం గురించి ఎంతో గొప్పగా చెప్పాడు ఈ రాజావారు…తాను పడ్డ కష్టాలను…ఇబ్బందులను తెలియజేస్తూనే…ఎక్కడా వ్యక్తిత్వం కోల్పోకుండా బ్రతికాను అని తెలిపాడు రాజా.

అదే క్రమంలో తనకు చిరంజీవి మోహన్ బాబుల మధ్య జరిగిన గొడవలను గుర్తుకు చేసుకుంటూ ముఖ్యంగా బ్రహ్మానందంతో ఏర్పడ్డ గొడవ గురించి వివరించాడు. తనికెళ్ళ భరణి మల్లిఖార్జునరావు ఇలా కొంతమంది హాస్య నటులతో కలిపి తాను ఏర్పాటు చేసిన ‘బ్రహ్మానందం ఛారిటబుల్ ట్రస్ట్’ వ్యవహారాలలో నిధులు దుర్వినియోగం అయ్యాయని వచ్చిన అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ తాను ముక్కు సూటిగా మాట్లాడుతానని తనను రెచ్చగొట్టి తరువాత చాలామంది హాస్యనటులు తప్పుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే విషయం దాసరి నారాయణరావు వరకు వెళ్ళడంతో దాసరి తనను మందలించి విషయాన్ని సద్దుబాటు చేసిన విషయాన్ని బయట పెట్టాడు. మొత్తంగా తన ముక్కు సూటి తనం వల్లనే ఇలా ఇబ్బందులు పడ్డాను అని చెబుతూనే…ఇంకా…డ్రగ్స్,సినిమాల్లో ఎక్స్‌పోసింగ్ ఇలా చాలా విషయాలపై మనసు విప్పి మాట్లాడాడు రాజా..


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus