బాహుబలి కంక్లూజన్ విడుదలకు అడ్డుగా మారిన పిటిషన్!

  • April 13, 2017 / 09:25 AM IST

బాహుబలి కంక్లూజన్ విడుదలకు కోట్లమంది ఎదురు చూస్తుంటే.. సినిమా రిలీజ్ ఆపాలని ఓ వ్యక్తి కోర్టుని ఆశ్రయించడం సంచలనంగా మారింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ఈనెల 28  న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్, చెన్నై లో  తమిళ ఆడియో వేడుకను వైభవంగా నిర్వహించి, ప్రచారంలో బిజీగా ఉన్న చిత్ర బృందానికి ఈ ఫిటిషన్ తలనొప్పిగా మారింది. కోలీవుడ్ కి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శరవణన్ తనకు రావలసిన బకాయిలు చెల్లించేవరకూ బాహుబలి-2 విడుదలను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.

బాహుబలి మొదటి పార్ట్ కి సంబంధించి 1.18 కోట్ల మేర బకాయిలు తనకు అందాల్సి ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.  ఇండస్ట్రీలో ఈ పిటిషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. మూవీ దర్శకుడు, నిర్మాతలు ఈ పిటిషన్‌పై  స్పందించలేదు. శరవణన్ దాఖలు చేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు రానుంది. బాహుబలి రిలీజ్‌ను అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus