ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది.. కానీ..?

  • June 8, 2019 / 05:28 PM IST

దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది శ్రీయ శరన్. సీనియర్ హీరోలతో పాటూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ల సరసన కూడా ఆడి పాడింది. అలా వరుస ఆఫర్లతో మంచి పీక్స్ లో ఉన్న సమయంలో కొత్త హీరోయిన్ల రాకతో ఆమె చాలా వరకూ సైడయిపోయింది. ఇప్పుడు సీనియర్ హీరోల సరసన అవకాశాలు వస్తుండడంతో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ ఢిల్లీ బ్యూటీ. ‘వీరభోగ వసంతరాయలు, ‘ఎన్టీఆర్ కధానాయకుడు’ చిత్రాల తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ కనిపించలేదు శ్రీయ.

దీంతో ఒక పక్క అనుమానాలు మరో పక్క ఆమె తదుపరి చిత్రం ఏంటనే చర్చగా మొదలైంది టాలీవుడ్లో..! ఒకానొక సందర్భంలో ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది అనే పుకార్లు కూడా షికార్లు చేసాయి. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీయా ఓ క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేసిందట. విభిన్న చిత్రాలని రూపొందించే చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో శ్రీయ ప్రధాన పాత్ర పోషించబోతుందట. ఈ చిత్రంలో శ్రీయా తల్లి పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది. గతంలో కూడా ‘మనం’ , ‘గోపాలా గోపాలా’, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలలో తల్లి పాత్రలలో కనిపించింది శ్రీయ. ఈ క్రేజీ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus