ఇకనుంచి బుల్లితెరపై కనువిందు చేయనున్న శ్రుతి

  • November 6, 2018 / 08:29 PM IST

విశ్వనటుడు కమల్‌హాసన్‌ “బిగ్‌బాస్‌” రియాల్టీషో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టి సినీ అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేశారు. రెండు సీజన్లపాటు ఆయన బుల్లితెరపై ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన బాటలోనే తనయ శ్రుతిహాసన్‌ కూడా నడుస్తోంది. ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్ లో బుల్లితెరకి పరిచయం అవుతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు శ్రుతిహాసన్‌ స్పందిస్తూ.. ‘తప్పకుండా నేనూ బుల్లితెరపై మెరుస్తా. బుల్లితెర ఇప్పుడు బుల్లితెర కాదు వెండితెర కంటే చాలా విస్తృతమైంది. ఫారెన్‌ కంట్రీస్‌లో సినిమాల కంటే టీవీ షోస్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు.

సినిమా స్థాయిలోనే టీవీ రంగం కూడా ఎదిగింది. అలాగే మన దేశంలోనూ బాగా బలోపేతం అయింది. బుల్లితెర ఎంట్రీ కూడా ‘బిగ్‌బాస్‌’లాంటి షో ద్వారా వస్తే చాలా హ్యాపీగా ఫీలవుతాను. నాన్న (కమల్‌హాసన్‌) మాదిరిగానే అందర్నీ అలరించే ప్రయత్నం చేస్తాను. ‘బిగ్‌బాస్‌’గా ఆయన బుల్లితెర ప్రస్థానం ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తోంది’ అని చెప్పింది. శ్రుతి ప్రస్తుతం కమల్‌హాసన్‌ శభాష్‌ నాయుడు’ చిత్రంలో నటిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus