సావిత్రి బయో పిక్ లో నటించనున్న సూర్య

  • March 25, 2017 / 11:01 AM IST

తెలుగువారు గర్వించదగ్గ నటీ నటుల్లో సావిత్రి ఒకరు. చక్కని అభినయంతో ఆమె తమిళీయుల హృదయంలో చోటు దక్కించుకున్నారు. ఆమె జీవితంపై యువ దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్నారు.  రెండేళ్లుగా ఆమె గురించి పరిశోధించి స్క్రిప్ట్ రెడీ చేసుకున్న అశ్విన్ త్వరలో షూటింగ్ కి వెళ్లనున్నారు. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటించనుంది. క్యూట్ బ్యూటీ సమంత జమున గా కనిపించనుంది.  వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్, ఎన్నార్ పాత్రలు ఎవరు పోషిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. వీరికంటే ముందు శివాజీ గణేశన్ పాత్రకు హీరో దొరికారు.

సావిత్రికి భర్తగా సినిమాలో ఇతని పాత్ర కీలకం కానుంది. రీసెంట్ గా నాగ్ అశ్విన్, తమిళ హీరో సూర్యను కలిసి కథ చెప్పారని సమాచారం శివాజీ గణేశన్ పాత్రలో నటించడానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిన్నట్లు తెలిసింది. కానీ కొన్ని మార్పులు సూచించారని, అందుకు దర్శకుడు అంగీకరిస్తే డేట్స్ ఇవ్వడానికి సూర్య సిద్ధంగా ఉన్నారని టాక్. మరి సూర్య చెప్పినట్లు శివాజీ గణేశన్ పాత్రలో మార్పులు చేయడాకిని నాగ్ అశ్విన్ సిద్ధంగా ఉన్నారా? అనేది ఇప్పుడు సస్పెన్స్. ఈ సస్పెన్స్ మరి కొద్ది రోజుల్లో వీడిపోనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus