త్వరలో థాంక్స్ మీట్ ఏర్పాటుచేయనున్న బాహుబలి టీమ్!

  • May 17, 2017 / 12:18 PM IST

ఎస్.ఎస్. రాజమౌళి వెండితెరపై సృష్టించిన బాహుబలి కంక్లూజన్ గత నెల 28  న  ప్రపంచవ్యాప్తంగా 9,000 థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజు నుంచి ఈరోజు వరకు రోజుకో రికార్డును బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది. ఇప్పటి వరకు 1500 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ అదే జోష్ తో దూసుకుపోతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు అద్భుతంగా నటించిన ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంలో మీడియా పాత్ర కూడా ఉంది.

అందుకే నిర్మాతలు శోభు, ప్రసాద్ లు మీడియాకి థాంక్స్ మీట్ ఏర్పాటు చేయాలనీ డిసైడ్ అయ్యారు. ప్రభాస్, రానాలకు అనువైన తేదీన ఈ సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. భారీ విందును కూడా అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా తెలుగు మీడియా సినీ జర్నలిస్టులందరూ ఈ మీట్ లో పాల్గొననున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus