బడ్జెట్ పై దృష్టి పెట్టని మురుగదాస్

  • September 17, 2016 / 02:01 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ ఏఆర్ మురుగ దాస్ కాంబినేషన్లో వస్తున్న ద్వి భాషా చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. గత వారం రోజులుగా చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ఎస్.జె. సూర్య, మహేష్ బాబులపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇందులో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియదర్శి, తమిళ నటుడు ఆర్ జె బాలాజీ తదితరులు పాల్గొంటున్నారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర సంగతిని డైరక్టర్ బయట పెట్టారు. ఇప్పటి వరకు ఈ చిత్ర బడ్జెట్ ను ఫైనల్ చేయలేదని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎందుకు ఫైనల్ చేయలేదని విలేకరి అడగగా.. ” సినిమా బాగా రావాలి .. మా మైండ్లో ఆ ఆలోచన తప్ప మరోటి లేదు. స్క్రిప్ట్ డిమాండ్ బట్టి ఖర్చుచేస్తాం. మాకు బడ్జెట్ ముఖ్యం కాదు. క్వాలిటీ ముఖ్యం” అని స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే మురుగదాస్ ఈ సినిమాపై ఎంత సీరియస్  గా ఉన్నారో అర్ధమవుతోంది. డైరక్టర్ అడిగినట్లుగా నిర్మాతలు ఎం.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సినిమాకు అవసరమైనవన్నీ ఆలస్యం లేకుండా అరేంజ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు. ఇన్వెస్ట్ గేట్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ దీపావళికి రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus