మెగా ఫోటో పై ఉపాసన ఆసక్తికర కామెంట్!

  • November 23, 2017 / 09:59 AM IST

చిరంజీవి.. రామ్ చరణ్.. సేమ్ టు సేమ్ అని అందరికీ తెలిసిందే. నటనలోనూ, డ్యాన్స్ లోను చిరుకి తగ్గ తనయుడిని రామ్ చరణ్ అనేక సార్లు నిరూపించుకున్నారు. ఖైదీ నంబర్ 150 లో ఇద్దరూ ఒకే డ్రస్ లో ఒకే స్టెప్ వేస్తుంటే మెగా అభిమానులకు చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. అలాగే ఫ్యాన్స్ సంబరపడే   సందర్భం మరొకటి వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాకోసం కష్టపడుతున్నారు. రామ్ చరణ్ కూడా రంగస్థలం 1985 కోసం శ్రమిస్తున్నారు. ఇద్దరూ తమ తమ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తీరిక లేదు. అయినా చెర్రీ డాడీతో కలిసి కాసేపు తీ తాగుతూ రిలాక్స్ అయ్యారు. ఈ సందర్భాన్ని కెమెరాలో బంధించి షేర్ చేశారు. ‘‘నేను, నాన్న సేమ్ టు సేమ్.

ఇద్దరం గడ్డం లుక్ లోనే, ఇది మాకు కాఫీ టైమ్. నాన్నగారితో ఆనందంగా ఇలా బయటికి వచ్చి కాఫీ త్రాగడం కోసం ఒప్పించాను..’’ అంటూ చరణ్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోకి అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. మెగా కోడలు   ఉపాసన మాత్రం ఓ ఆసక్తికర కామెంట్ పెట్టింది. “తల్లిదండ్రులతో ఇలా ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యమైన విషయం. తండ్రీ కొడుకుల మధ్య ఇది వెలకట్టలేని ఓ అమూల్యమైన బహుమతి. సినిమాల్లో తండ్రి ఎలాగ దూసుకెళ్తున్నాడో.. కొడుకు రామ్ చరణ్ కూడా అలాగే దూసుకెళ్తున్నాడు..” అంటూ ఉపాసన పోస్ట్  చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus