ఇస్మార్ట్ శంకర్ విజయంతో పూరీకీ మెగా కాంపౌండ్ ఎంట్రీ దొరికిందా ?

  • July 27, 2019 / 02:55 PM IST

ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ.. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆటో జానీ” అనే సినిమా ఎనౌన్స్ మెంట్ వరకూ వచ్చి ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ.. పూరీ జగన్నాధ్ చెప్పిన సెకండాఫ్ చిరంజీవికి నచ్చకపోవడంతో.. ఆ ప్రొజెక్ట్ ను హోల్డ్ లో పెట్టి తమిళ చిత్రం “కత్తి” రీమేక్ గా ‘ఖైదీ నెం.150″లో నటించారు చిరంజీవి. ఆ తర్వాత పూరీ ఎన్నిసార్లు ప్రయత్నించినా చిరంజీవితో మాత్రం ఒకే చెప్పించుకోలేకపోయాడు పూరీ. పైగా.. అప్పటికి మనోడు వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతుండడంతో చిరంజీవి కూడా రిస్క్ చేయదలుచుకోలేదు.

అయితే.. పూరీ జగన్నాధ్ ఇప్పుడు “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో సూపర్ హిట్ కొట్టడం, ఆ సినిమా బి,సి సెంటర్లలో రచ్చ చేస్తుండడం అనేది సెన్సేషన్ గా మారింది. ఇక నిన్న రామ్ చరణ్ ఈ సినిమా విజయానికి పూరీకి ప్రశంసలు అందించడంతో.. పూరీకి మళ్ళీ మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ దొరికినట్లేనని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో “పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్” లతో సినిమాలు తెరకెక్కించి ఉన్న పూరీ జగన్నాధ్ కి చిరంజీవి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందంటే మామూలుగా ఉండదు మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus