బాహుబలి నిర్మాణ సంస్థ తీస్తున్న భారీ సీరియల్ స్వర్ణ ఖడ్గం

  • January 6, 2018 / 10:36 AM IST

తెలుగు సినిమాలు వందకోట్లు కలక్షన్స్ సాధిస్తే గొప్ప అనుకునే సమయంలో 250 కోట్లు పెట్టి బాహుబలి నిర్మించి ఆర్కా మీడియా సంస్థ సాహసం చేసింది. ఈ సాహసంలో నెగ్గి వాళ్ళు మాత్రమే కాకుండా తెలుగు వారు మొత్తం గర్వపడేలా చేసింది. అదే నిర్మాణ సంస్థ మరో సాహసం చేసింది. అత్యంత భారీ బడ్జెట్ తో స్వర్ణ ఖడ్గం అనే సీరియల్ నిర్మించింది. బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ ఈ భారీ జానపద సీరియల్ ను నిర్మిస్తున్నారు. వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరియల్ లో బుజ్జిగాడు ఫేం సంజన గల్రాని కీలక పాత్రలో నటిస్తోంది.

ఆమె ఈ సీరియల్ కోసం గుర్రపు స్వారీ, కత్తియుద్థాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. త్వరలో ఈ సీరియల్ ప్రసారం కానుండటంతో దర్శకుడు పూరి జగన్నాథ్.. సంజనకు, సీరియల్ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీరియల్ కోసం తాను కూడా సామాన్య ప్రేక్షకుడిలా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. వెండితెరపై జానపద కథతో కోట్ల కలక్షన్స్ రాబట్టిన ఆర్కా మీడియా వారు.. బుల్లి తెరపై అదే జానపద కథతో కోట్ల మంది మనసులను గెలుచుకోవడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus