Gopichand: ‘ఆరడుగుల బుల్లెట్’ ను ఆ దర్శకుడు వదిలేస్తే బి.గోపాల్ కంప్లీట్ చేసాడట..!

  • October 12, 2021 / 11:10 AM IST

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.2017లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థికలావాదేవీల కారణంగా ఆగిపోయి.. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఓటిటిలో విడుదలైతే చూసుకోవచ్చులే అని లైట్ తీసుకున్నారు.

అయితే ఈ చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. నిజానికి ఈ చిత్రం షూటింగ్ 2012లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుని మొదట సెట్స్ పైకి తీసుకెళ్ళిన దర్శకుడు బి.గోపాల్ కాదు. భూపతి పాండ్యన్ అనే తమిళ దర్శకుడు. 2000 వ సంవత్సరం నుండీ 2010 వ సంవత్సరం వరకు ఈయన తమిళంలో చాలా సినిమాలు తెరకెక్కించాడు. అక్కడ ఇతని హవా తగ్గడంతో తెలుగులోకి వచ్చి గోపీచంద్ తో సినిమా మొదలుపెట్టాడు.

‘జగన్మోహన్ ఐపీఎస్’ పేరుతో ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టాడు.ఆయన కొంత భాగం షూటింగ్ ను తెరకెక్కించిన తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ సంభవించడంతో అతను ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు. దాంతో నిర్మాతలు… బి.గోపాల్ తో బ్యాలన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేయించారు. తర్వాత బడ్జెట్ సమస్యలు కూడా తలెత్తాయి. దాంతో మరికొన్ని రోజులు ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. చివరాఖరికి ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఫైనాన్స్ చేయడంతో షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus