Thotapalli Madhu: వాణి విశ్వనాథ్ పై సీనియర్ నటుడు, రచయిత తోటపల్లి మధు షాకింగ్ కామెంట్స్

  • April 29, 2024 / 10:14 PM IST

సీనియర్ రచయిత, నటుడు అయిన తోటపల్లి మధు (Thotapalli Madhu) .. ఇప్పటి జనాలకి పెద్దగా తెలిసుండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ‘మామగారు’ ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ ‘అల్లరి అల్లుడు’ ‘హనుమాన్ జంక్షన్’ వంటి పెద్ద హిట్ సినిమాలకి రచయిత పనిచేశారు. అలాగే ‘లక్ష్మీ నరసింహా’ (Lakshmi Narasimha) ‘సినిమా చూపిస్తా మావా’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించాడు కూడా..! అయితే కొన్నాళ్లుగా ఈయన ఏ సినిమాల్లోనూ నటించడం లేదు. రైటర్ గా అయితే ఎప్పుడో ఫేడౌట్ అయిపోయాడు. అందుకేనేమో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

అయితే ఈ ఇంటర్వ్యూల్లో ఆయన చేసే కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల హీరోయిన్ వాణి విశ్వనాథ్ (Vani Viswanath) పై ఈయన చేసిన కామెంట్స్ పెద్ద చర్చకి దారి తీశాయి. తోటపల్లి మధు మాట్లాడుతూ.. “వాణి విశ్వనాథ్ కి నాకు మధ్య ఎఫైర్ ఉంది. పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ‘భలే దంపతులు’ సినిమా టైంలో మేము రిలేషన్ షిప్ లో ఉన్నాం. దాదాపు ఏడాది పాటు రిలేషన్లో ఉన్నాం. కేరళ వద్ద ఓ ప్లేస్ కి వెళ్లి చాలా రోజులు కలిసున్నాం.

వాళ్ళ నాన్న గారు కూడా కవి.కాబట్టి ఆమెకు నా పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఓ రోజు మేము గుడికి వెళ్లాం.. పెళ్లి చేసుకోవడానికి..! కానీ ఆ రోజు సూర్య గ్రహణం అని గుడి మూసేసి ఉంది. దీంతో తిరిగొచ్చేశాం. ఈ సినిమా హీరోయిన్స్ తో ప్రాబ్లమ్ ఏంటంటే.. వాళ్ళకి డబ్బులు తెచ్చిపెట్టి.. ఎంత సేపు పొగుడుతూ కూర్చోవాలి. లేదంటే వాళ్ళు మనసు మార్చేసుకుంటారు” అంటూ ఏంటేంటో చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus