మరో నటికి కరోనా సోకిందట…!

  • April 7, 2020 / 07:33 PM IST

మొన్నటికి మొన్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ రావడంతో బాలీవుడ్ అతలాకుతలం అయిపొయింది. మొత్తానికి ఆమె ఇప్పుడు కోలుకుంది.దీంతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది అనే లోపే మరో నటికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో అక్కడ కల కలం తలెత్తింది. విషయంలోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీమ్ మోరానీ రెండో కూతురు, నటి జోయా మోరానీకి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేసారు వైద్య నిపుణులు.

ఆమెతో పాటు ఆమె అక్క షాజా మోరానీకి కూడా పాజిటివ్ అని తేలడంతో .. అక్కడి జనాలు మరింత ఆందోళన చెందుతున్నారు. మార్చి నెల మధ్యలో జోయా రాజస్థాన్ నుండీ తిరిగి వచ్చిందట. దీంతో తన అక్కతో పాటు నిన్ననే కరోనా టెస్ట్ చేయించుకుందని తెలుస్తుంది. ఈ క్రమంలో వారిద్దరికీ పాజిటివ్ రావడంతో చాలా కంగారు పడినట్టు తెలుస్తుంది. జోయా ఇప్పుడు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్ లో చికిత్స పొందుతోందట.

మరోవైపు ఆమె అక్క ముంబైలోని నానావతి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటోందని సమాచారం. తరువాత వీళ్లిద్దరి పేరెంట్స్ కూడా టెస్టులు చేయించుకున్నారట. కానీ వీరి రిపోర్టులు ఇంకా రాలేదు. షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ను కరీమ్ మోరానీ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక జోయా నటిగా …’ఆల్వేస్ కబి కబి’ ‘మస్తాన్’ ‘బాగ్ జానీ’ వంటి చిత్రాల్లో నటించింది. అంతేకాదు ‘అకూరి’ ‘బూత్ పూర్వ’ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus