‘అరుంధతి’ నటుడు కొడుకు.. హాస్పిటల్ పాలయ్యాడట..!

  • April 9, 2020 / 04:00 PM IST

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం వైన్ షాప్ లు బంద్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మద్యానికి అలవాటు పడిన వాళ్లు … అస్సలు తట్టుకోలేకపోతున్నారు. రిషి కపూర్ వంటి నటులు కూడా.. ఓ గంట వైన్ షాప్ లు తెరిచి ఉంచాలి అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా మనం చూసాం. అయితే దానికి వారు నిరాకరించడం జరిగింది. ఇక కొన్ని చోట్ల అయితే మద్యం షాపులు పగలకొట్టి… మద్యం బాటిల్స్ ను దొంగతనం చేసిన వారిని కూడా మనం చూస్తూ వస్తున్నాం.

సాధారణంగా ఆకలి ఎన్ని తప్పులు అయినా చేయిస్తుంది.. అని అనుభవజ్ఞులు చెబుతుంటారు. కానీ మందుకు బానిస అయినవాళ్ళే ఎంతకైనా తెగిస్తారు అని కూడా ఋజువవుతుంది. ఇక మద్యానికి అలవాటు పడిపోయిన వాళ్లు నిద్ర పట్టకపోవడంతో వింత పనులు .. ఘోరమైన పనులు చేస్తున్నారు. నిద్ర మాత్రలు వేసుకోవడం …ఏది పడితే ఆ ఇంజక్షన్ లు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది.

తమిళంతోపాటు తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించిన సీనియర్ నటి మనోరమ కుమారుడు నిద్రమాత్రలు మింగినట్టు తెలుస్తుంది. ఈ వార్త చెన్నై మీడియా వర్గాల నుండీ అందింది. ఆయన్ను వెంటనే చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కువ డోస్ లో మాత్రలు మింగడంతో పరిస్ధితి విషమంగా మారిందని వారు చెబుతున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus