పెళ్లి వార్తలపై స్పందించిన నికిషా పటేల్

  • May 14, 2018 / 06:21 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కొమురం పులి ద్వారా తెలుగు వారికీ పరిచయమైన నికిషా పటేల్ (Nikesha Patel).. ఆ తర్వాత “ఓమ్”, “అరకురోడ్డులో” సినిమాల్లో నటించింది. అయినా ఆమెకు మంచి బ్రేక్ రాలేదు. సో ఏ భాషలో అవకాశం వచ్చినా కాదనకుండా చేస్తోంది. తాజాగా “తేరీ మెహర్బానియా 2 ” అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మపై ఈ మధ్య ఓ వార్త బాగా వైరల్ అయింది. అదే ఇండియన్ మైఖేల్ జాక్సన్, దర్శకుడు అయిన ప్రభుదేవాని పెళ్లి చేసుకుంటానని నికిషా పటేల్ చెప్పినట్టు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. పెళ్లి అయిన ప్రభుదేవాపై నికిషాకి ప్రేమ ఎలా పుట్టిందో.. అని కొంతమంది చెవులు కొరుక్కున్నారు.

ఈ విషయంపై ఆమె నేడు స్పందించింది. ఆ న్యూస్ నిజం కాదని స్పష్టం చేసింది. తాను ప్రభుదేవానే కాదు, ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదని చెప్పింది. “మీడియాలో నా గురించి ఏవేవో రాస్తున్నారు. ఈ వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది. ప్రభుదేవా నాకు మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి. ప్రభుదేవాను ‘సార్’ అని పిలుస్తాను. మా మధ్య ప్రేమ, పెళ్లి వంటి ఆలోచన లేదు. ఇక నుంచి అయినా ఇటువంటి వార్తలు ఆపండి” అని వెల్లడించింది. ప్రస్తుతం తెలుగులో “గుంటూరు టాకీస్ 2 ” చిత్రంలో నటించి మంచి అవకాశాలు పట్టేయాలని చూస్తోంది. మరి ఈ చిత్రమైనా నికిషా కెరీర్ కి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus