తాను చేసిన తప్పు గురించి మీడియాతో షేర్ చేసుకున్న పూజా హెగ్డే

  • March 27, 2019 / 06:46 PM IST

“ముకుందా”తోనే హీరోయిన్‌గా పరిచయమైనప్పటికీ.. అల్లు అర్జున్ సరసన నటించిన “డీజే” సినిమాలో ఆరబోసిన అందాల వల్లే క్రేజ్ సంపాదించుకున్న కథానాయకి పూజా హెగ్డే. ఆ తర్వాత ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన “అరవింద సమేత”తో తన ఖాతాలో బ్లాక్‌ బస్టర్‌‌ను వేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌కు కూడా ఇంపార్టెన్స్ ఉండటంతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రభాస్, మహేష్ బాబుల సినిమాలో నటిస్తున్న పూజా హెగ్డే హీరోయిన్ గా కెరీర్ మొదలెట్టి అయిదేళ్ళు పూర్తవుతున్నా తాను నటించిన సినిమాల సంఖ్య ఇంకా సింగిల్‌ డిజిట్‌లోనే ఉండటానికి కారణం ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చింది పూజా.

“కెరీర్ మొదట్లో బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా అవకాశమొచ్చింది. దీంతో “మొహంజదారో” సినిమా కోసం రెండు సంవత్సరాల డేట్స్ వారికి ఇచ్చేసాను. సాధారణం ఓ నటి కెరీర్‌లో రెండేళ్ల సమయం ఎంతో కీలకమైనది, ఆ విషయం తెలియక సినిమాకు సైన్ చేసాను, నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. ఆ తర్వాత తెలిసినా ఫలితం లేకపోయింది. నేను చేసిన రెండు మూడు సినిమాలు నాకు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆ తర్వాత నుండి ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను. ఇప్పుడు కెరీర్ గాడిలో పడింది” అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus