టాలీవుడ్ లో తనకిష్టమైన హీరోల గురించి చెప్పిన స్నేహ .!

  • April 6, 2018 / 11:48 AM IST

హద్దులు మీరని అందంతో… చక్కని అభినయంతో బాపు బొమ్మ స్నేహ తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకొని కొన్నేళ్లు నటనకు దూరమైంది. తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే అప్పుడప్పుడు వెండితెరపై, బుల్లితెరపై మెరుస్తోంది. భర్త ప్రసన్నతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలోను కనిపిస్తోంది. ఈమె తాజాగా బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాలో కీలకరోల్ అందుకుంది.

చెర్రీకి పెద్ద వదినగా నటించనుంది. నిన్న హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాతో వ్యక్తిగత, వృత్తిగత విషయాలను పంచుకుంది. ‘‘అమ్మగా చాలా ఆనందంగా గడుపుతున్నా. పిల్లల గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నా. పిల్లలపట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా.’’ అని వెల్లడించింది. తెలుగులో మీకు నచ్చిన హీరోలు ఎవరని ప్రశ్నించగా నవ్వుతూ సమాధానమిచ్చింది. “నాకు తెలుగు హీరోల్లో నాగార్జున, అల్లు అర్జున్, రామ్ చరణ్ లంటే చాలా ఇష్టం. వీరి నటన చాలా సరదాగా ఉంటుంది. ‘శ్రీరామదాసు’ సినిమాలో నాగార్జున చాలా బాగా నటించారు” అని తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus