ఇన్నేళ్ళకు మళ్ళీ కలిసి నటించబోతున్న అరవింద్ స్వామి,మధుబాల..!

  • October 16, 2020 / 06:42 PM IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మ‌ణిర‌త్నం తెరకెక్కించిన ‘రోజా’ చిత్రాన్ని ఎప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేరు అనడంలో సందేహం లేదు. అప్పటి కుర్రకారుని ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంది. తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. రెహ‌మాన్ సంగీతం.. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ.. మణిరత్నం డైరెక్షన్.. కలగలిపి సినిమాని సూపర్ హిట్ గా నిలబెట్టాయి.ఇక అర‌వింద్ స్వామి, మ‌ధుబాల ల కెమిస్ట్రీ కూడా అప్పటి యూత్ ను బాగా ఆకట్టుకుంది.

అయితే తరువాత ఎందుకో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. మరి స్క్రిప్ట్ కుదరకో.. వేరే ఇతర కారణాల వల్లనో కావచ్చు. అయితే 28 ఏళ్ల త‌ర‌వాత ఈ జంట మళ్ళీ కనువిందు చేయనుందట. వివరాల్లోకి వెళితే.. ‘త‌లైవి’ చిత్రంలో అరవింద్ స్వామి, మధుబాల జంటగా కనిపించబోతున్నారట. ఏ.ఎల్ విజ‌య్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఎం.జి.ఆర్ గా… అర‌వింద‌స్వామి కనిపించబోతున్నాడు. ఇక ఎంజీఆర్ భార్య జాన‌కీ రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో మ‌ధుబాలని ఎంపిక చేసుకున్నారని తెలుస్తుంది.

‘త‌లైవి’ జయలలితగా కంగనా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో మధుబాల.. ‘అంతకు ముందు ఆ తరువాత’ ‘సూర్య వెర్సస్ సూర్య’ ‘నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ అవేమి ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టలేదు. మరి ఈ చిత్రమైనా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కు హెల్ప్ అవుతుందేమో చూడాలి..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus