మూడు సంవత్సరాల తరువాత ప్రారంభమౌతున్న చిత్రం..!

  • May 10, 2016 / 08:48 AM IST

నీరజ్ గుప్తా దర్శకత్వంలో 2013 లో ప్రారంభమైన చిత్రం ‘భయ్యాజీ సూపర్ హిట్’. ఈ చిత్రంలో సన్నీ డియోల్, ప్రీతి జింటాలు జంటగా నటిస్తుండగా.. ఆర్ధిక సమస్యల కారణంగా ఈ చిత్రం మధ్యలో ఆగిపోయింది.

తాజాగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘ 20-25 రోజుల షెడ్యూల్ ను మొదలు పెట్టాము. ఇప్పటికే ప్రీతి జింటా పై పలు సన్నివేశాలు చిత్రీకరించాము. ప్రస్తుతం ప్రీతి.. తన భర్త, వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతోంది. సన్నీకి ఇంకా వయసెమీ అవ్వలేదు. అతను ఇంకా యువకుడి లానే కనిపిస్తున్నాడు. అతనిపై పలు యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నామ’ని నీరజ్ తెలిపాడు. కాగా ఈ చిత్రాన్ని రెండు నెలల్లో పూర్తి చేసి ఈ ఏడాదే విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus