నైజాంలో ‘అజ్ఞాతవాసి’ కలెక్షన్స్

  • January 11, 2018 / 06:56 AM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజు మిశ్రమ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలక్షన్ల వర్షం కురిపించింది. ప్రీమియర్ షోల ద్వారా అమెరికాలో బాహుబలి రికార్డును కొల్లగొట్టిన అజ్ఞాతవాసి.. నైజాం ఏరియాల్లో అత్యధికంగా వసూలు చేసింది. ఈ ఏరియాలో ఫస్ట్ డే 5.40 కోట్ల షేర్ ను వసూలు చేసి పవన్ గత రికార్డులను బద్దలు కొట్టింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెల 17 వ తేదీ వరకు రోజుకు 5 షోల అనుమతి ఉండటంతో హక్కుల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు మేలు జరిగే అవకాశముంది.

హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం నైజాం హక్కులు 27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ మూవీ 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోను భారీగా అమ్ముడుపోయింది. అయితే అంచనాలను ఈ సినిమా అందుకోకపోయినప్పటికీ పవన్ కి ఉన్న క్రేజ్ తో కలక్షన్స్ కి డోకా ఉండదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus