Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

ఏ వారసత్వపు హీరోకు లేనంత హైప్‌.. ఆ హీరోకు దక్కింది. తొలి సినిమాగా భారీ యాక్షన్‌ సినిమాను ఎంచుకున్నారు. కానీ బాక్సాఫీసు దగ్గర ఊహించని పరాజయం ఎదురైంది. దాంతో నెపో కిడ్స్‌కు కూడా ఇండస్ట్రీ అంత ఈజీ కాదు అనే మాట మరోసారి తేలింది. ఆ హీరోనే అఖిల్‌ అక్కినేని. ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన అఖిల్‌.. సరైన విజయం అందుకున్నది లేదు. మధ్యలో ఓ సినిమా బాగుందనిపించినా.. ఆ క్రెడిట్‌ హీరోయిన్‌కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆరో సినిమా మీద అందరి దృష్టి ఉంది.

Akhil Akkineni

ఆ సినిమానే ‘లెనిన్‌’. ఈ సినిమా గురించి చాలా నెలలుగా వార్తలు వింటూనే ఉన్నాం. అందులో ఎక్కువ శాతం పోస్ట్‌ పోన్‌ వార్తలే. అయితే ఇప్పుడు సినిమా గురించి గుడ్‌ వైబ్స్‌ బయట కనిపిస్తున్నాయి. దానికి కారణం సినిమా కోసం అటు అఖిల్‌, ఇటు నాగార్జున తీసుకుంటున్న జాగ్రత్తలు. చేస్తున్న కామెంట్లే. తాజాగా సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా అఖిల్ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. అఖిల్‌ పెళ్లయ్యాక వస్తున్న తొలి సినిమా కావడం గమనార్హం.

ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ.. తన సినిమా వచ్చి మూడేళ్లు అయిందని, అందుకు క్షమించాలని అఖిల్‌ అభిమానులను కోరాడు. ఈ రోజు నేను ఎక్కువ మాట్లాడకూడదు. అసలు నేను కాదు ఈసారి సినిమా మాట్లాడుతుంది. నేను నిద్రపోయి రెండు రోజులైంది. అయినా మిమ్మల్ని చూసి ఎనర్జీ వచ్చింది. జులై 10 వరకూ (ఆ రోజే సినిమా రిలీజ్‌) పని చేసే శక్తినిచ్చారు. నా నుంచి సినిమా వచ్చి మూడేళ్లు అయింది. ఈ సారి నన్ను నమ్మండి’ అని అన్నారు.

‘‘శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా సెయ్యాలని! అట్నే సేద్దామా?’ అంటూ సినిమాలో అఖిల్ చెప్పిన డైలాగ్ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజులపాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక్క నిబంధన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేలపై చిందకూడదు అంటూ నాగార్జున మాటలతో టీజర్‌ ఆసక్తికరంగా ఉంది.

ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus