ఈ గందరగోళంలో తన కుమారుడి కెరీర్ పాడవ్వకూడదని

  • April 21, 2018 / 11:27 AM IST

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఆఫీసర్’ చిత్రంలో నటిస్తున్న నాగార్జున షూటింగ్ టైమ్ లో వర్మలో ఒక దర్శకుడిగా వచ్చిన మార్పులను గమనించి తన రెండో కుమారుడైన అఖిల్ ను వర్మ చేతిలో పెడదామని ఫిక్స్ అయ్యాడు. ఈమేరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా. దాంతో.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత అఖిల్ సినిమా వర్మతోనే అని నాగార్జున అభిమానులతో సహా ప్రేక్షకులందరూ దాదాపుగా ఫిక్స్ అయిపోయారు.

కట్ చేస్తే.. “శ్రీరేడ్డితో పవన్ కళ్యాణ్ ను ఆ బూతు మాట తిట్టించింది నేనే” అంటూ వర్మ విడుదల చేసిన వీడియో ఇండస్ట్రీలో చిన్నసైజు సునామీ సృష్టించింది. ముఖ్యంగా.. మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా మెగా ఫ్యాన్స్ తోపాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, ఆఖరికి వర్మ శిష్యులు కూడా వర్మకి రివర్స్ అయిపోయారు. దాంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ట్విట్టర్ ద్వారా ఎప్పట్లానే వెటకారపు పోస్టులు చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నాడు వర్మ. అయితే.. వచ్చే నెల మే 24న విడుదలవుతున్న “ఆఫీసర్” విషయంలోనే ఇంకా క్లారిటీ లేకపోవడంతో.. ఈ పరిస్థితుల్లో వర్మ దర్శకత్వంలో అఖిల్ నటించడం అనేది శ్రేయస్కరం కాదని భావించిన నాగార్జున ఆ ప్రొజెక్ట్ క్యాన్సిల్ చేశాడని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus