దీనిపై రేణు దేశాయ్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు

  • June 23, 2018 / 01:18 PM IST

“అకీరాని జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలవకండి.. అతను తల్లితండ్రి నీడలో పెరగాలనుకోవడం లేదు.. సొంతం గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు” అని రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. తమ అభిమాన హీరో కొడుకుని అలా పిలవద్దని చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోయారు. రేణు పై కోపాన్ని ఆపుకున్నారు. కానీ అవకాశం రాగానే ట్రోల్ చేశారు. పవన్ కల్యాణ్ నిన్న విజయవాడలో తన భార్య అన్నా లెజినోవాతో సహా పెద్ద కుమారుడు అకీరాతో కలిసి గృహప్రవేశం చేశారు. ఇక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులులేకుండా పోయింది. “వారసుడొచ్చాడు..” అంటూ ఆ ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు పవన్ కల్యాణ్‌కు తోడుగా.. ఆయన రాజకీయ వారసుడిగా అకీరా ఇక్కడే ఉండిపోతాడని ప్రచారం చేశారు.

రేణు రెండో పెళ్లి చేసుకోబోతున్నందుకు అకీరా విజయవాడలోనే ఉండిపోతాడని వార్త వ్యాపించింది. ఈ వార్తలు రేణూదేశాయ్‌కు నిద్ర లేకుండా చేసింది. అందుకే ట్విట్టర్‌లో వెంటనే క్లారిటీ ఇచ్చింది. ”అకీరా తన స్కూల్ హాలిడేస్‌ను తన తండ్రితో గడేపేందుకే వెళ్లాడు. అంతేకానీ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోలేదు. నిన్న విజయవాడలో కల్యాణ్‌గారితో అకీరా కనిపించినప్పటి నుంచి నాకు ఒకటే మెసేజ్‌లు వస్తున్నాయి. వాటికి క్లారిటీ ఇవ్వడానికే ఈ ట్వీట్ చేస్తున్నా” అంటూ రేణూ స్పష్టం చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం తగ్గించారు. అందుకే సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు, ప్రజల జీవితాల్లో భాగమైన వారు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని రేణుకి ఇప్పుడు స్పష్టంగా అర్ధమై ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus