ఆకట్టుకొంటున్న అల్లు అర్జున్ కొత్త స్పీచ్

  • December 18, 2018 / 11:10 AM IST

త్రివిక్రమ్ తో సినిమా మొదలవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉండడంతో ప్రస్తుతం మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితులు మరియు సన్నిహితుల సినిమా రిలీజ్ ఈవెంట్స్ కు అటెండ్ అవుతూ టైమ్ పాస్ చేస్తున్నాడు. మొన్నమధ్య విజయ్ దేవరకొండ “ట్యాక్సీవాలా” ప్రీరిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయిన బన్నీ నిన్న శర్వానంద్ “పడి పడి లేచే మనసు” ప్రీరిలీజ్ ఎవెంట్ కు కూడా హాజరయ్యాడు. ఈ వేడుకలో ఎప్పట్లానే రైటర్స్ కు రెస్పెక్ట్ ఇస్తూ స్పీచ్ మొదలెట్టిన బన్నీ.. ఆ తర్వాత శర్వానంద్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక సాయిపల్లవితో కలిసి నటించాలని ఉందని, ఆమెతో డ్యాన్స్ చేయాలని ఉందని బన్నీ ప్రకటించడం విశేషం.

ఇదే తరుణంలో ఈమధ్య కొందరు రాజకీయపరంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూ.. ఏమాత్రం మర్యాద లేకుండా వాళ్ళను సంభోదించడాన్ని తప్పుబట్టాడు. “చిరంజీవి ఏంట్రా.. చిరంజీవి గారు అనాలి” అని బన్నీ నొక్కిపెట్టి చెప్పడం మెగా అభిమానులందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాక.. బన్నీ మీద రెస్పెక్ట్ పెంచింది. బన్నీ చెప్పింది కూడా నిజమే.. ఏదో పోలిటికల్ గా వాళ్ళు కాస్త వీక్ అయ్యుండొచ్చు కానీ.. వాళ్ళు ఎన్నో ఏళ్ల తరబడి సంపాదించుకున్న పేరుప్రఖ్యాతులనైనా దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే వాళ్ళకి మర్యాద ఇవ్వడం అనేది కనీస బాధ్యత.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus