కన్ఫర్మ్ : లింగుసామికి ఒకే చెప్పిన బన్నీ

  • September 22, 2016 / 07:18 AM IST

“ఎన్నాళ్ళో వేచిన ఉదయం…” లింగుసామి, అల్లు అర్జున్ కలిసి ఈ పాట పాడుకునే సందర్భం రానే వచ్చింది. తెలుగువారితో అన్నిటా ‘సరైనోడు’ అనిపించుకున్న అల్లు అర్జున్ తమిళ ప్రేక్షకులతోనూ అదేమాట అనిపించుకోవాలని ఎన్నాళ్ళుగానో ఉవ్విళ్ళూరుతున్నాడు. అల్లు అర్జున్. ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది. కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు చిత్ర బృందం.

తమిళ దర్శకుడు లింగుసామి-అల్లు అర్జున్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల బన్నీని వదిలి ఎన్టీఆర్ వద్దకు లింగుసామి వెళ్లినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనికి ‘దువ్వాడ జగన్నాధం’ రూపేణా హరీష్ శంకర్ తో బన్నీ చేయి కలపడం మరింత బలం చేకూర్చింది. వీటన్నిటి చెరిపేస్తూ తమిళ నాట అగ్ర నిర్మాణ సంస్థ అయిన స్టూడియో గ్రీన్ అల్లు అర్జున్-లింగుసామి సినిమాని ప్రకటించారు. దువ్వాడ జగన్నాధం డిసెంబర్ నాటికి పూర్తి చేసి జనవరి నుండి లింగుసామి సినిమాని బన్నీ సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus