‘ఎబిసిడి’ యూనిట్ ను ఇబ్బంది పెడుతున్న అల్లు శిరీష్..!

  • March 7, 2019 / 01:25 PM IST

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎబిసిడి’. మలయాళీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వ్యవహారం చాలా విచిత్రంగా సాగుతుంది. అప్పటికప్పుడు టెక్నీషియన్లను మారుస్తూ పోతున్నారు చిత్ర యూనిట్. సినిమా మొదలుపెట్టినప్పుడే సినిమాటోగ్రాఫర్ గా శ్యామ్ కే నాయుడు ను అనుకున్నారు… తరువాత మార్చేసారట. ఇక సంగీత దర్శకుడి విషయంలోకన్నడ రంగం శిరీష్ కావాలని పట్టుకొచ్చారట. అయితే ఇప్పుడు రీ రికార్డింగ్ ను మాత్రం వేరే వాళ్ళతో చేయిస్తున్నారట. ఇక ఎడిటిర్ ను కూడా మార్చేశారనే టాక్ వినిపిస్తోంది.అయితే దాని గురించి పెద్దగా చప్పుడు లేదు.

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు పీఆర్ టీమ్ ను కూడా మార్చేసాడట శిరీష్. ‘గీతా ఆర్ట్స్’ కి అత్యంత సన్నిహితులైన పీఆర్ టీమ్ వుండగానే, శిరీష్ మరో టీమ్ ని హైర్ చేసుకున్నారట. శిరీష్ చేసిన సినిమాలు చాలా తక్కువైనప్పటికీ ఇంతలా ప్రొడక్షన్ టీంలో ఇన్వాల్వ్ అయ్యి కెలికేస్తుండడం చిత్ర యూనిట్ ను కొంచెం ఇబ్బంది పెడుతుందట. తాజాగా అల్లు అరవింద్ ‘ఎబిసిడి’ చిత్రాన్ని చూసారంట.. అయితే ఆయన స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం మర్చి 1 న విడుదల కావాల్సి ఉండగా… బయ్యర్స్ ఈ చిత్రాన్ని కొనడానికి ఎక్కువ మంది రాకపోవడంతో… స్వయంగా అల్లు అరవిందే ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus