24 ఏళ్ళ తరువాత అఖిల్ కు తల్లిగా నటిస్తుంది?

  • June 13, 2019 / 12:29 PM IST

అక్కినేని అఖిల్ ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు కానీ ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. ఈసారి తన నాలుగవ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని తెగ కష్టపడుతున్నాడు. బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థ అయిన ‘గీతా ఆర్ట్స్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. విజయ్ దేవరకొండ తోనే ‘గీత గోవిందం’ తో 100 కోట్ల గ్రాస్ కొట్టించిన అల్లు అరవింద్.. అఖిల్ తో కూడా మంచి మంచి బ్లాక్ బస్టర్ కొట్టిస్తాడనే నమ్మకంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్ తీసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయింది ఈ చిత్రం. ప్రస్తుతం దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో అఖిల్ తల్లి పాత్ర చాలా కీలకమట. ఈ పాత్ర కోసం సీనియర్ నటి ఆమనిని ఎంపిక చేశారట. 1995 లో విడుదలైన ‘సిసింద్రీ’ చిత్రంలో అఖిల్ కు తల్లిగా నటించింది. మళ్ళీ 24 ఏళ్ళ తరువాత అఖిల్ కు తల్లిగా నటించబోతుంది ఆమని. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus