పోలీసులను ప్రశ్నించిన అనసూయ!

  • July 19, 2018 / 07:58 AM IST

జబర్దస్త్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ.. క్షణం, సోగ్గాడే చిన్ని నాయన వంటి చిత్రాల ద్వారా వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన రంగస్థలం లో రంగమ్మత్తగా పాపులర్ అయ్యారు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈమె నిన్న పోలీసులను ప్రశ్నించారు. ఓ వీడియోని పోస్ట్ చేస్తూ..  ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం ఆమె బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 దారిలో వెళుతుండగా, పక్కన కారు డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎదురుగా ఉన్న మొబైల్‌లో వీడియో చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు.

ఈ సన్నివేశాలని అనసూయ తన మొబైల్ కెమెరాలో బంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. “డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌.. ఇలాంటి సంఘటనలు నన్ను బయపెట్టిస్తున్నాయి. ఇంతక ముందు వేరే వారి తప్పిదం వలన నేను ప్రమాదానికి గురయ్యాను. దయ చేసి ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్స్‌ని వదలొద్దు. రోడ్స్ పై తమకిష్టమొచ్చినట్టు డ్రైవ్ చేసే వారికి ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా?” అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా పోస్ట్ చేసినందుకు నెటిజనులు అనసూయని అభినందిస్తున్నారు. నియమాలను పట్టించుకోకుండా డ్రైవింగ్ చేసేవారిని పట్టుకోవడానికి పోలీసులు మరింత శ్రద్ధ పెట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus