అనసూయొకటి తలిస్తే.. సోషల్ మీడీయా ఇంకోటి తలచింది..!

  • September 6, 2017 / 10:20 AM IST

రెండ్రోజుల క్రితం అనసూయ “రంగస్థలం” సినిమాలోని తన స్టిల్ ను సరిగ్గా కాలు మాత్రమే కనపడేలా కట్ చేసి తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేసి.. “నింద నిజమైతే తప్పక దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి వూరుకో..” అనే డైలాగ్ ను కూడా పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అనసూయ కనిపించకపోవడంతో ఫోటోను సరిగ్గా పట్టించుకోని జనాలు.. అనసూయ పోస్ట్ చేసిన డైలాగ్ ను మాత్రం సీరియస్ గా తీసుకొన్నారు. అది “రంగస్థలం” సినిమాలోని డైలాగ్ అనుకోని అందరూ తమ తమ ఎకౌంట్స్ లో పోస్ట్ చేశారు.

కానీ.. అది సినిమాలోని డైలాగ్ కాదట, అనసూయ “అర్జున్ రెడ్డి” సినిమా విషయంలో చేసిన వ్యాఖ్యల కారణంగా ఆమె సోషల్ మీడియాలో ఎదుర్కొన్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలను గూర్చి అనసూయ ఆ విధంగా పోస్ట్ పెట్టింది. దాన్ని జనాలు సినిమా డైలాగ్ అనుకోవడంతో ఆఖరికి సుకుమార్ స్వయంగా అది సినిమా డైలాగ్ కాదండీ బాబూ అంటూ తన సన్నిహితులకి చెప్పుకోవాల్సి వచ్చింది, అదన్నమాట సంగతి!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus