‘యాత్ర’ చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలిపిన అనసూయ..!

  • February 11, 2019 / 07:34 AM IST

వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రం ఇటీవలే విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో వై.ఎస్.ఆర్ పాత్ర పోషించిన మమ్ముట్టికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఇక ఈ చిత్రంలో సుచరితరెడ్డి అనే పాత్రని పోషించింది హాట్ యాంకర్ అనసూయ.

ఇక ఈ పాత్రకు కూడా మంచి స్పందన లభించింది. ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త పాత్రకి ఎలాంటి స్పందన లభించిందో.. ‘యాత్ర’ చిత్రంలో సుచరిత రెడ్డి పాత్రకు కూడా అంత మంచి స్పందన లభిస్తుంది. అయితే ఈ చిత్రంలో అనసూయ కనిపించింది కొద్దిసేపే అయినా మంచి నటన కనపరిచింది అనసూయ. ‘రంగస్థలం’ చిత్రంలో గోదావరి యాసతో మెప్పించినట్టే.. ఈ చిత్రంలో కూడా రాయలసీమ యాసలో ఇమిడిపోయింది. ఇక ఈ చిత్రం పై అనసూయ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ … “సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు నా పై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ఈ పాత్రను నేను పోషించగలనని నాపై నమ్మకం ఉంచిన డైరెక్టర్‌ మహి వి రాఘవ, ’70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ కు ధన్యవాదాలు” అంటూ తన ట్విట్టర్లో పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus